Home » KonaSeema
గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. సెప్టెంబరు 1 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆగస్టు 31న ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అఽధికారులను ఆదేశించారు.
మండల విద్యాశాఖాధికారి-2గా పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని ఎంఈవో-2లు అంతా డీఈవో ఎం.కమలకుమారికి వినతిపత్రం అందజేశారు.
పరిశ్రమలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ హెచ్చరించారు. గత జూలై నెలలో ఎన్టీఆర్ జిల్లాలోని బుధవాడ ఆల్ర్టాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ప్రమాదాలు నివారించేందుకు, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాస్థాయి సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అసెస్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.
రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్నకాలనీలో ఇసుక దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వేల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే తరలించేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తోడు దొంగలుగా మారి ఈ బాగోతాన్ని నడిపించారు.హౌసింగ్ ఏఈ కేవీ భాస్కర్ ఫిర్యాదుతో వారిపై ద్రాక్షారామ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో(Ambedkar Konaseema Dist) పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.
ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు.
Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 2.35 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకి చేరుకోనున్నారు. ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో 2.50 గంటలకి ఈతకోట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు