Home » Mancherial
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పొరాడుదా మని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్సింగ్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్లు పిలుపునిచ్చారు. సోమవారం బస్టాండ్ ఆవరణలో నాలుగు లేబర్ కోడ్ల ప్రతులను దహ నం చేశారు.
ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో అసైన్డ్ భూముల గుర్తింపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఎక్కడ అసైన్డ్ భూములు ప్లాట్లుగా మార్చారు..? అందులో ఎన్ని అన్యాక్రాంతమ య్యాయి..? అనే అంశాలపై స్పష్టత రానుంది. ఇదే సమయంలో అసైన్డ్ భూముల లెక్క ఇక పక్కాగా నమోదు కానుంది.
ఎట్టకేలకు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మత్య్సకారులకు ఉపాధిని కల్పించడానికి ఇప్పటికే జిల్లాలో చెరువులు, కుంటల, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వేయాల్సి ఉండగా ఆలస్యమైంది. టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో చేప పిల్లల పంపిణీ మత్య్స శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు.
నస్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా చేపట్టిన చీరలను ఆదివారం వారసంత ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు ఆదివారం సాయంత్రం కలెక్టర్ కుమార్దీపక్, మున్సిపల్, పోలీస్ అధికారు లతో కలిసి జిల్లా కేంద్రంలోని మార్కెట్లో పర్యటిం చారు. మార్కెట్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే అధికారులను అదేశిం చారు.
జిల్లాలో ఎక్కడాలేని విధంగా అక్రమ కట్టడాలపై నస్పూర్ మున్సిపల్ అధికారులు తొలిసారి కొరఢా ఝళిపించారు. అధికారుల తీరుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగించాలనే డిమాండ్లు వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి.
తమ పార్టీకి చెందిన నేతల ఇళ్ళను కూల్చివేయడం కక్ష సాధింపులో భాగమేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికార యంత్రాంగం అత్యుత్సహం ప్రదర్శిస్తుందన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుక చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్ కార్మికులకు తెల్లరేషన్ కార్డులు, పింఛన్లు, పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తానన్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారధి ఫౌండేషన్ హైదరాబాద్ వారు జిల్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన డిబేట్, వ్యాసరచన పోటీల్లో కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో ఎస్.యాదయ్య తెలిపారు.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్గా 33 శాతం వాటా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శుక్రవారం సచివాలయంలో లాభాల బోనస్ను ప్రకటించారు.