Home » Manifesto
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
AP Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కూటమి(TDP Alliance) మేనిఫెస్టో (Manifesto) విడుదలైంది. రాష్ట్రంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామంటూ ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్ ప్రకటించారు చంద్రబాబు(Chandrababu), పవన్
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం...
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపే (మంగళవారం) కూటమి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని అంటున్నారని.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అంటూ మాజీ ఎంపీ సూటిగా ప్రశ్నించారు.
వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ అభిమానులు కూడా హార్ట్ అయ్యారు. పాత చింతకాయ పచ్చడిలా ఉందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎన్నికలకు ముందే జగన్ రాజీనామా చేసినట్టు ఉందని విమర్శించారు.
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
వైసీపీ మేనిఫెస్టో చూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.