Home » Manipur Violence
మణిపూర్లో జిరిబం జిల్లాలోని మాంగ్బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
మణిపూర్లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.
మణిపుర్లో(Manipur Riots) గతేడాది జరిగిన హింసలో బాధితులను పరామర్శించడానికి ప్రధాని మోదీకి(PM Modi) సమయం ఉండట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్(Jairam Ramesh) విమర్శించారు. ఒక్కసారీ మణిపుర్కి రాని మోదీ.. విదేశీ పర్యటనకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఆ క్రమంతో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్బంగా చర్చించారు.
గతేడాది మే 3న మణిపూర్ ప్రారంభమైన హింస నేటికీ కొనసాగుతోందని, కుటుంబ సభ్యులతోపాటు ఇళ్లు, ఆస్తులు, కుటుంబాలను కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారని హైదరాబాద్లో నివసిస్తున్న మణీపూర్(Manipur) కూకీ-జో తెగలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ(CBI) ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్లో వెల్లడించారు.
మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 19న ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించి తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్లో భాగంగా మణిపూర్లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్లోని ఖోంగ్మాన్లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్ బూత్లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.