Home » Manipur Violence
చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్తో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.
మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. చురచంద్పూర్ హింసాకాండపై విచారణ జరిపేందుకు మెజిస్టీరియల్ విచారణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
1961 తర్వాత మణిపూర్లో స్థిరపడిన వారిని తరలిస్తామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోమవారం (నిన్న) ప్రకటన చేశారు. కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. దాంతో మణిపూర్లో అక్రమంగా తలదాచుకున్న వారిని తరలించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత మణిపూర్కి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు. కులం, కమ్యూనిటీని పట్టించుకోకుండా.. 1961 తర్వాత రాష్ట్రానికి వచ్చిన వాళ్లందరికి వెనక్కు తిరిగి పంపిస్తామని ఉద్ఘాటించారు.
హింసాకాండతో ఇటీవల అట్టుడికిన మణిపూర్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాష్ట్రం ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. మణిపూర్ లోయలోని ఒక తిరుగుబాటు సంస్థతో శాంతి చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు తెలిపారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు.
ఈ ఏడాది మే నెలలో 3వ తేదీన మణిపూర్లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. పెద్ద వివాదంగా మారింది. కుల హింస మంటల్లో ఆ రాష్ట్రం...
అక్కడెక్కడో జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ చాలాసార్లు స్పందించారు. ఇక్కడి నుంచి మానవతా సహాయం పంపించారు. ఈ సమస్యపై ఆ రెండు దేశాధినేతలతో...
మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.