Home » Manipur
మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగడంపై కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం ఒప్పకోకపోవడం లేదని తెలిపింది. ప్రధాని ముఖం చాటేస్తున్నారని ఆరోపించింది.
మణిపూర్ అంశంపై పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడింది. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. మణిపూర్లో అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం అట్టుడికిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాల పట్టువిడుపులు లేని వైఖరి ప్రదర్శిస్తుండటం, పార్లమెంటు వెలుపల నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.
మణిపూర్లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు.
మణిపూర్లో పరిస్థితి రాన్రానూ ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.
మణిపూర్లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.
మణిపూర్లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.