Home » Nara Bhuvaneswari
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ నారా భువనేశ్వరి సైతం ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును తన ప్రాణం గానూ.. తనలో సగంగానూ భువనేశ్వరి పేర్కొన్నారు.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.
ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
అమెరికా పర్యటనా ముగించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించారు.
MCP (మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్) మల్టీస్టార్ మహా కూటమి ఎపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతోందన్నారు. 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.
అన్వేషణలనుండి ... అద్భుత దైవీయ స్పృహలోకి ప్రవేశించిన ప్రస్థానంలో పరమాద్భుతాలు నిస్వార్ధంగా సృష్టిస్తున్నారని ... ఈ పవిత్రతలు, అపురూపతలు నచ్చడం వల్లనే ... శ్రీనివాస్ లోని మేధ, ప్రజ్ఞ, నిస్వార్ధత కృష్ణయ్యను ఆకర్షించి ఇంతటి మహా గ్రంథ యజ్ఞ కార్యానికి బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించారని కిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు స్పష్టం చెయ్యడం గమనార్హం.ప్రశంసనీయం.