Home » Ponnam Prabhakar
మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నిమ్స్లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ సాయిసతీశ్(Professor Saisathish), జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కోరారు. నేడు (బుధవారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.
అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అగ్రపథాన పయనిస్తూ.. దశాబ్ద కాలాన్ని దాటుతోంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
‘పసికూన లాంటి మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నావు.. మిస్టర్ కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు పీకలు ఎగురుతాయ్ జాగ్రత్త’ అని మంత్రి పొన్నం
పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని అమలుచేయని బీజేపీ, బీఆర్ఎ్సలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రశ్నించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.