Home » TDP
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్షాపు నిర్వహించనున్నారు.
పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లకు నిప్పుపెట్టిన ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు.
అధికార తెలుగుదేశం పార్టీ గుంతకల్లు మునిసిపాలిటీని చేజిక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు ఆకర్షితుతున్నా.. ఇన్నాళ్లూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మునిసిపాలిటీలో అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి కౌన్సిల్లో మెజారిటీ లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ప్రస్తుత పాలకవర్గానికి నాలుగేళ్లు పూర్తయ్యాక చైర్మన పదవిని చేజిక్కించుకునేందుకు వీలుగా వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ శిబిరం యోచిస్తోంది. మాసాంతపు మునిసిపల్...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తన విధ్వంసకర పాలనకు ప్రజావేదిక కూల్చివేతతో శ్రీకారం చుట్టారని అన్నారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని లేకపోయినా ప్రతీ ఒక్కరిపై రూ. 2.50 లక్షల అప్పు ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం అప్పన్న స్వామి తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 1040 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవగానే పరిస్థితులు మారిపోయాయి. మున్సిపాలిటీ సమయం ఇంకా రెండేళ్లు ఉండటం, పైగా రాష్ట్రంలో టీడీపీ గెలిచి, వైసీపీ పూర్తిగా కుదేలైపోవటంతో ఇక్కడి కౌన్సిలర్లు పూర్తిగా ఆలోచనలో పడిపోయారు. దీనికి తోడు వైసీపీ ముఖ్య నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నియోజకవర్గంలో..
మున్సిపల్ పీఠం అధిష్టించేందుకు టీడీపీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీలో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎక్కువమంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడంతో చైర్మన్ పీఠం సులువుగా టీడీపీ పరం కానుంది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో..