Home » TG Govt
పెట్టుబడులకు అధిక లాభాల పేరుతో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కొట్టేసిన కేసులో హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరంపర కొనసాగుతోంది.
ఇసుక తరలింపులో అక్రమాలను అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అనుసరించాలని తెలంగాణ మినరల్ డెవల్పమెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) యోచిస్తోంది.
అవి 58 ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గుర్తులు.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి విద్యుత్తు వెలుగులు అందింది అక్కడి నుంచే.. తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే.. 100 మీటర్లపైన పొడువుతో ఎంతో గంభీరంగా కనపడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.
రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం నాడు మధిరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఆదివారం నాడు అన్నం వడ్డించారు. అయితే ఈ సమయంలో కారం పొడితో భోజనం పెట్టినట్లు ప్రచారం జరిగింది. పాఠశాలలో జరిగిన ఘటన వివాదాన్ని రేపింది.
ఉప్పల్ ఫ్లైఓవర్ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ధరణి పోర్టల్లో ఇంతకాలం పరిష్కారానికి వీలులేని సమస్యలకు చరమగీతం పాడేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం తీసుకురానున్న ఆర్వోఆర్-2024 ముసాయిదా బిల్లులో పరిష్కార మార్గాలను చూపించనుంది.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. తీర్పును ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.
తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.