Home » TG Govt
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు ప్రతిపాదనలతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కోరారు. నంది అవార్డులంత గొప్పగా డిసెంబర్9న గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ఈ వేదికగా ప్రకటించానని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. ఐదో రోజు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్పై చర్చించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్ స్కామ్పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల రివకరీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో జూలై 25 వరకు 21,193 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో బదిలీల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఆఫీస్ బేరర్ అంటూ లేఖలు తెచ్చుకుని బదిలీల నుంచి మినహాయింపు పొందిన వారందర్నీ.. ఆఖరికి యూనియన్ నేతలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు వీటిని పొడిగించారు. అయితే ఎక్సైజ్శాఖలో మాత్రం వాటి ఊసే లేదు. అధిక ఆదాయం ఆర్జించే శాఖలైన రిజిస్ట్రేషన్, ఆబ్కారీలో వీలును బట్టి బదిలీలు చేసుకునే వెసులుబాటు ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పందించారు.