Home » Tirupathi News
క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.
తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.
TTD ON Employee Paganism: టీటీడీలో సేవలు అందిస్తున్న ఓ ఉద్యోగిపై అన్యమత ప్రచారం, నిర్వాహక లోపాల ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆసుంతా అన్యమత ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త వచ్చేసింది. 2025 జూలై నెల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, గదుల బుకింగ్ డేట్స్ను అధికారికంగా ప్రకటించింది.
ఒకప్పట్లో ఊర్లో చెత్తను శివార్లలో పడేసేవారు. కొండల్లా పేరుకుపోయి దుర్గంధం నెలకొనేది. పర్యావరణ సమస్యతో పాటు స్థానికులూ అనారోగ్యం బారిన పడేవారు. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో అలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏడేళ్ల కిందట సీఎం హోదాలో చంద్రబాబు రూపకల్పన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వీటిని నిర్లక్ష్యంగా వదిలేయగా.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితం మూడు నెలల్లో జిల్లాలోని పంచాయతీలకు రూ.13.5 లక్షల ఆదాయం వచ్చింది.
చంద్రగిరిలో పట్టణంలో గురువారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో కొత్తపేటలోని రోడ్డు పక్కనున్న భారీ చింత చెట్టు నేలకొరిగింది.
విద్యుత్ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.
తిరుపతి నగర పాలక సంస్థ పన్ను వసూళ్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది.
ఒంటిమిట్ట రాములోరి కల్యాణం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఆలయానికి రానున్నారు. భక్తులు, టీడీపీ అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల సంవత్సరాల కల నెరవేరింది