Home » TS Assembly
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి బే షరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెడ్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పోలీస్ శాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు అనుమతి లేదని పేర్కోంది. కాగా ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలకు హాజరవుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రెండు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి.. వాటిపై చర్చించనున్నారు. అంతకుముందు 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో ప్రధానంగా సమగ్ర ఇంటింటి కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య న్యాయ్ కమిషన్ రిపోర్ట్పై కేబినెట్లో చర్చించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. మన్మోహన్కు భారతరత్న ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, భారతరత్న పురస్కారానికి మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యాడని, ఇక తన వల్ల కాదని దూస గణేష్ అనే నేతన్న తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంతరి కేటీఆర్ అన్నారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ కూతుళ్లకు సమాధానం చెప్పాలన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ పై కేసు నమోదుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
గురువారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి (ఆర్ఓఆర్) 2024 బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లు సభలో ఆమోదం పొందుతుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలి సమావేశాలకు రోజుకొక వేష ధారణతో వస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల వేషంలో వచ్చిన నేతలు గురువారం రైతు కండువాలతో సభకు రానున్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుపట్టనున్నారు.