Share News

TG News: అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదుల యత్నం.. పోలీసుల అరెస్టు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:53 PM

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..

TG News: అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదుల యత్నం.. పోలీసుల అరెస్టు..
TG Assembly Lawyers Protest

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) దగ్గర ఉద్రిక్తత (Tension) పరిస్థితి నెలకొంది. నిన్న (సోమవారం) న్యాయవాది హత్య ఘటనపై నిరసనగా అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు (Lawyers) యత్నించారు. అడ్వేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ (Advocate Protection Act)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకువెళుతున్నన్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. గన్‌పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా సోమవారం చంపాపేటలోని న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్‌ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.

Also Read..: రజినీ ఫిర్యాదుతోనే తనిఖీలు: జాషువా


తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గన్ పార్క వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చిన సమయంలో న్యాయవాదులు.. పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.


కాగా ప్రియురాలి చిరునామా చెప్పడంలేదని ఓ న్యాయవాదిని దారుణంగా చంపాడో దుండగుడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇజ్రాయెల్‌ కుటుంబసభ్యులతో కలిసి ఐఎస్‌ సదన్‌ పరిధిలోని చంపాపేటలో నివాసముంటూ.. తన ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంటులో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని వాచ్‌మెన్‌ భార్యతో అదే ప్రాంతంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా ఇజ్రాయెల్‌ వారికి రాజీ కుదిర్చాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ వాసులు వాచ్‌మెన్‌ కుటుంబాన్ని పనుల నుంచి తొలగించగా, వారు తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాలని దస్తగిరి పలుమార్లు ఇజ్రాయెల్‌ను కోరాడు. తాను లాయర్‌నని బ్రోకర్‌ను కాదని ఇజ్రాయెల్‌ దస్తగిరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు దస్తగిరిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. వాచ్‌మెన్‌ భార్య తనకు దూరం కావడానికి ఇజ్రాయెలే కారణమని భావించిన దస్తగిరి, ఆయన వల్లే పోలీసులు తనకు కౌన్సిలింగ్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో ఇజ్రాయెల్‌పై పగ పెంచుకుని చంపాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌ వాకింగ్‌కు వెళ్లి వస్తున్న సమయంలో దస్తగిరి కాపుకాసి ఆయనపై కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఇజ్రాయెల్‌ను అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

హైకోర్టులో విధుల బహిష్కరణ

ఎర్రబాపు ఇజ్రాయెల్‌ అనే న్యాయవాదిని ప్రత్యర్థి కక్షిదారు హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇందుకు నిరసనగా మంగళవారం హైకోర్టులో విధులు బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అయితే హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 12:53 PM