పెళ్లికి ముందే కాబోయే భర్తతో శారీరకంగా కలిసిన యువతి.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మృతి.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-09-08T21:11:25+05:30 IST
వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మరో నెల రోజుల్లో పెళ్లి ఫిక్స్ అయింది.. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో కాబోయే భర్తకు ఆమె శారీరకంగా దగ్గరైంది.
వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మరో నెల రోజుల్లో పెళ్లి ఫిక్స్ అయింది.. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో కాబోయే భర్తకు ఆమె శారీరకంగా దగ్గరైంది.. అదే ఆమెకు శాపంగా మారింది.. శృంగారం తర్వాత ఆమెకు విపరీతంగా రక్తస్రావం జరిగింది.. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆమె బతకలేదు.. రక్తం చాలా ఎక్కువగా పోవడంతో మరణించింది.. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకుని దర్యాఫ్తు ప్రారంబించారు. భోపాల్లోని కోలార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కోలార్లోని ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు మండ్దీప్నకు చెందిన 28 ఏళ్ల యువతితో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నెల చివర్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామనే ఉద్దేశంతో ఇద్దరూ కలుద్దామనుకున్నారు. తనకు కాబోయే భర్త ఉంటున్న ఇంటికి గత ఆదివారం యువతి చేరుకుంది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. అయితే శృంగారం తర్వాత ఆమెకు జననేంద్రియం నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. ఎంతకూ తగ్గలేదు. దీంతో సదరు యువకుడు ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెకు రక్తస్రావం తగ్గలేదు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతి.. ఇంట్లోకి దూరి ఆమె జుట్టు కత్తిరించిన 21 ఏళ్ల కుర్రాడు.. అసలేం జరిగిందంటే..
750 గ్రాముల బంగారాన్ని ఇంట్లోంచి చోరీ చేసిన పదో తరగతి విద్యార్థిని.. అంత బంగారాన్ని ఏం చేశావని నిలదీస్తే..
అక్కడి వైద్యులు కూడా రక్తస్రావం తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా రక్తస్రావం ఆగలేదు. దీంతో ఆ యువతి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకున్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.