పెళ్లయిన మూడో రోజే భర్త నుంచి విడాకులు కోరిన నవ వధువు.. కారణమేంటని ఆరా తీస్తే చివరకు షాకింగ్ ట్విస్ట్
ABN , First Publish Date - 2021-09-13T16:28:51+05:30 IST
వారికి పెళ్లి జరిగి మూడు రోజులే అయింది.. వివాహం తర్వాత అత్తింటికి వచ్చిన నవ వధువు మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది..
వారికి పెళ్లి జరిగి మూడు రోజులే అయింది.. వివాహం తర్వాత అత్తింటికి వచ్చిన నవ వధువు మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది.. పుట్టింటికి వెళ్లిన మూడు గంటల్లోనే భర్తకు ఫోన్ చేసి విడాకులు కావాలని అడిగింది.. దీంతో షాకైన వరుడు ఆమె గురించి ఆరా తీశాడు.. ఆమె మైనర్ అని, ఆమె పేరు కూడా వేరు అని అతడికి తెలిసింది.. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.. రాజస్థాన్లోని పెహర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పెహర్కు చెందిన శశికాంత్ గౌతమ్కు గతేడాది సమీప బంధువు ద్వారా ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నచ్చడంతో ఆమెను గౌతమ్ 2020, నవంబర్ 25న కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన వధువు రెండ్రోజులు అక్కడ ఉంది. మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన మూడు గంటలకు గౌతమ్కు ఫోన్ చేసి విడాకులు కావాలని అడిగింది. షాకైన గౌతమ్ కారణం ఏంటని అడిగాడు. నువ్వు నాకు నచ్చలేదని, ఈ పెళ్లి తన ఇష్టప్రకారం జరగలేదని చెప్పింది.
రాత్రి 2.30 గంటలు.. పడుకోకుండా అలా నిలబడ్డావేంటని ప్రశ్నించిన తల్లి.. కూతురి నుంచి నో రెస్పాన్స్.. దగ్గరకు వెళ్లి చూస్తే..
ఓ సారి కలవొచ్చు కదా.. అంటూ టిక్టాక్ ఫ్రెండ్ అడగడంతో సరేనందా యువతి.. అదే ఆమె పాలిట శాపమైందిలా..!
ఆ అమ్మాయి వివరాలను ఆరా తీసినపుడు గౌతమ్కు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ అమ్మాయి మైనర్ అని, పెళ్లి కోసం ఆమె వయసు రెండు సంవత్సరాల ఎక్కువగా చెప్పారని తెలిసింది. ఆ మేరకు ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరాన్ని మార్పించారని తేలింది. వయసు మాత్రమే కాదు.. ఆమె పేరును కూడా తనకు తప్పు చెప్పారని తెలుసుకున్నాడు. దీంతో సదరు యువకుడు గత శనివారం పోలీసులను ఆశ్రయించాడు. తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు.