పెళ్లి తర్వాత 25 మందితో ఆమె వెళ్లిపోయింది.. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త ఏం అనేవాడంటే..

ABN , First Publish Date - 2021-09-09T16:14:58+05:30 IST

ఆమెకు పెళ్లి జరిగి పదేళ్లు.. ఆ పదేళ్లలో ఆమె 24 మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది..

పెళ్లి తర్వాత 25 మందితో ఆమె వెళ్లిపోయింది.. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త ఏం అనేవాడంటే..

ఆమెకు పెళ్లి జరిగి పదేళ్లు.. ఆ పదేళ్లలో ఆమె 24 మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది.. ఒక్కోసారి ఒక్కొక్కరితో ఆమె వెళ్లిపోయింది.. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త పెద్ద మనసుతో ఆదరించాడు.. అయినా ఆమె తాజాగా మరోసారి మరో వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.. తన పిల్లలు ముగ్గురినీ ఎదురింట్లో వదిలేసి ఆమె 25వ సారి ఇంటి నుంచి పారిపోయింది.. అసోంలోని నగౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


మధ్య అసోంలోని డింగ్ లఖర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. మూడు నెలల క్రితమే అతడి భార్య మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పదేళ్లలోనూ ఆమె 25 మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. గ్రామంలోని ఒక్కోసారి ఒక్కో పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి పారిపోయేది. అలా ఇప్పటికి 24 సార్లు వెళ్లిపోయింది. మళ్లీ కొద్ది రోజులకే తిరిగి వచ్చేసేది. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త ఆదరించాడు. ఇంట్లోకి రానిచ్చాడు. 


ఇవి కూడా చదవండి


భర్తతో పక్కింటి మహిళ మాట్లాడటాన్ని చూసిన భార్య.. అనుమానంతో ఆమె ఎంత దారుణానికి పాల్పడిందంటే..





పెళ్లికి ముందే కాబోయే భర్తతో శారీరకంగా కలిసిన యువతి.. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మృతి.. అసలేం జరిగిందంటే..


మూడు నెలల క్రితం ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత మూడు నెలల చిన్నారిని ఎదురింట్లో అప్పగించి గడ్డి కోసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. ఇది 25వ సారి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అని ఆమె భర్త చెబుతున్నాడు. 22 వేల రూపాయలు, కొంత బంగారం తీసుకుని ఆమె వెళ్లిపోయిందని తెలిపాడు. ఆమె గ్రామంలోని చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని గ్రామస్థులు చెబుతున్నారు.

Updated Date - 2021-09-09T16:14:58+05:30 IST