Viral Video: దర్జాగా వచ్చి, తుపాకీ చూపించి.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-03T23:51:26+05:30 IST

మహారాష్ట్రలో కొందరు దుండగులు ఓ కార్యాలయంలోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. ప్రాణభయంతో అంతా వణికిపోయి, మిన్నకుండిపోయారు. ఉద్యోగులను బెదిరించిన దుండగులు.. ఏకంగా..

Viral Video: దర్జాగా వచ్చి, తుపాకీ చూపించి.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా..

ఏవైనా వదులుకుంటారు గానీ.. ప్రాణాలను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా. దీన్నే కొందరు నేరస్థులు అవకాశంగా తీసుకుని విచ్చలవిడి నేరాలకు పాల్పడుతుంటారు. కొన్ని కొన్ని చోరీలైతే చాలా విచిత్రంగా ఉంటాయి. మహారాష్ట్రలో కొందరు దుండగులు ఓ కార్యాలయంలోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. ప్రాణభయంతో అంతా వణికిపోయి, మిన్నకుండిపోయారు. ఉద్యోగులను బెదిరించిన దుండగులు.. ఏకంగా కోటి రూపాయలకు పైగా నగదును దర్జాగా ఎత్తుకెళ్లారు..


అది ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని ఆర్థిక సేవలు అందించే కార్యాలయం. ఫిబ్రవరి 2వ తేదీన కొందరు దుండగులు మాస్కులు ధరించి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఎవరు మీరు అని ఉద్యోగులు ప్రశ్నించడంతో.. జేబులో నుంచి తుపాకీ బయటికి తీశారు. కేకలు పెడితే కాల్చిపడేస్తామంటూ బెదిరించారు. దీంతో వణికిపోయిన ఉద్యోగులు మిన్నకుండిపోయారు. తర్వాత అక్కడున్న నోట్ల కట్టలను బ్యాగులో వేసుకున్నారు. ఎవరి ప్రాణాలకూ హాని చేయకపోవడంతో హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుండగులు వెళ్లిన వెంటనే కార్యాలయ యజమాని.. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.

మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ.. సంతోషంగా ఉండకుండా.. ప్రియుడితో కలిసి ఇలా చేస్తుందనుకోలేదు..



Updated Date - 2022-02-03T23:51:26+05:30 IST