మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ.. సంతోషంగా ఉండకుండా.. ప్రియుడితో కలిసి ఇలా చేస్తుందనుకోలేదు..
ABN , First Publish Date - 2022-02-03T22:22:33+05:30 IST
అప్పటికే ఇద్దరికి విడాకులిచ్చిన మహిళ.. మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమెలో ఏమాత్రం సంతోషం లేదు. చివరకు ప్రియుడితో కలిసి ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
నేరాలకు పాల్పడే వారు తాము ఎవరికీ పట్టుబడమనే ధోరణిలోనే ఉంటారు. అయితే చివరికి ఎక్కడోచోట చిన్న క్లూతో దొరికిపోతుంటారు. నిజానిజాలు వెలుగులోకి రాగానే ఊచలు లెక్కెడుతూ ఉంటారు. ఎంత తెలివైన నేరస్థులైనా చిన్న క్లూతో దొరికిపోతారనడానికి మధ్యప్రదేశ్లో తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ. అప్పటికే ఇద్దరికి విడాకులిచ్చిన మహిళ.. మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమెలో ఏమాత్రం సంతోషం లేదు. చివరకు ప్రియుడితో కలిసి ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ పరిధి కేదార్నగర్లో దీపక్, మంగళ దంపతులు నివాసం ఉంటున్నారు. దీపక్ స్థానికంగా ఉండే ఓ బిస్కట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళ అప్పటికే ఇద్దరిని వివాహం చేసుకుని, విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అనంతరం దీపక్ను మూడో వివాహం చేసుకుంది. ఇతడితో కొన్నాళ్లు సంతోషంగా ఉన్న మంగళ.. గణేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం కొన్నాళ్లకు దీపక్కు తెలిసి మంగళను గట్టిగా మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
హోటల్లో స్నేహితురాలితో గడిపిన యువకుడు.. కొన్నాళ్లకు ఫోన్లో సీన్ టూ సీన్ ప్రత్యక్షం.. అసలేం జరిగిందంటే..
భర్త మందలించినా మంగళ తన తీరు మాత్రం మార్చుకోలేదు. దీంతో ఇటీవల వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దీపక్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మంగళ, గణేశ్ కుట్రపన్నారు. గత నెల 30న మంగళ, దీపక్ కేదార్నగర్లో మళ్లీ ఇదే విషయమై గొడవపడ్డారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న గణేశ్.. ఒక్కసారిగా దీపక్పై దాడి చేశాడు. అనంతరం మంగళ, గణేశ్ కలిసి మూకుమ్మడిగా దాడి చేయడంతో దీపక్.. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద పడి ఉన్న మంగళ చెప్పు ఆధారంగా నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.