భార్య, నలుగురు పిల్లలతో పెళ్లికి వెళ్లి కారులో తిరిగొస్తున్న భర్త.. అర్ధరాత్రి 12 గంటలకు అతడు సజీవదహనం.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2022-02-12T00:01:05+05:30 IST

హర్యానాలో ఇలాగే నలుగురు పిల్లలతో కలిసి దంపతులు పెళ్లి కారులో ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో మార్గమధ్యలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో..

భార్య, నలుగురు పిల్లలతో పెళ్లికి వెళ్లి కారులో తిరిగొస్తున్న భర్త.. అర్ధరాత్రి 12 గంటలకు అతడు సజీవదహనం.. అసలేమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం

అంతవరకూ సంతోషంగా ఉన్న వారు, ఒక్కసారిగా అందరికీ కన్నీళ్లను మిగుల్చుతూ కానరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. దురదృష్టం వెంటాడే సమయంలో ఇలాంటి అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఉన్నట్టుండి భర్తకు భార్య, భార్యకు భర్త, దంపతులకు పిల్లలు దూరమైతే... ఆ బాధ మాటల్లో వర్ణించలేనంతగా ఉంటుంది. హర్యానాలో ఇలాగే నలుగురు పిల్లలతో కలిసి దంపతులు పెళ్లి కారులో ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో మార్గమధ్యలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు భర్త సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


హర్యానాలోని బర్వాలాలోని నయాగావ్‌ ప్రాంతంలో భీమ్ సింగ్‌ అనే వ్యక్తి భార్య నీలం, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గురువారం బంధువుల పెళ్లి కార్యక్రమం ఉండడంతో భీమ్ సింగ్‌.. తన కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. పెళ్లిలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో సరదాగా గడిపారు. కార్యక్రమం పూర్తి చేసుకుని పిల్లలతో కలిసి, పెళ్లిలోని మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ సంతోషంగా కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో చీకటి పడింది. అప్పటికే అర్ధరాత్రి 12 అవుతోంది. హిసార్ జిల్లా పరిధిలోని హిసార్విల్లే ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు భర్త సజీవదహనం అయ్యాడు.

ప్రియుడు అందుకు ఒప్పుకోలేదని కోపం పెంచుకుంది... ఓ రోజు అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..


ప్రమాదం జరిగన సమయంలో కారు అద్దాలు తెరచి ఉండడంతో భీమ్ సింగ్‌ భార్య, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. కళ్లముందే భర్త సజీవదహనమడాన్ని చూసి భార్య కేకలు పెడుతూ భోరున విలపించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె కేకలు అరణ్యరోదనలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి వచ్చే క్రమంలో ఈ విషాధ ఘటన జరగటం స్థానికులందరినీ కంటతడి పెట్టించింది.

అర్జెంట్ అంటూ కారును ఆపి మరీ టాయ్‌లెట్‌కు వెళ్లిన నవవధువు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

Updated Date - 2022-02-12T00:01:05+05:30 IST