భార్యకు టిఫిన్ తినిపించి, లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. కానీ మాట్లాడే క్రమంలో చివరకు ఇంత పని చేస్తాడనుకోలేదు..

ABN , First Publish Date - 2022-03-19T00:17:40+05:30 IST

భార్యను కంటికి రెప్పలా చూసుకునే ఇదే సమాజంలో నిత్యం నరకయాతన పెట్టే భర్తలు కూడా కోకొల్లలు. తనను నమ్మి వచ్చిన భార్యను అర్థం చేసుకుని, అన్యోన్యంగా గడపాల్సిన కొంతమంది..

భార్యకు టిఫిన్ తినిపించి, లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. కానీ మాట్లాడే క్రమంలో చివరకు ఇంత పని చేస్తాడనుకోలేదు..
ప్రతీకాత్మక చిత్రం

మెడలో తాళి పడిన మరుక్షణం నుంచీ భర్తే సర్వస్వంగా బతుకుతుంది భార్య. భర్తకు ఆపదొస్తుందనుకుంటే.. కన్న తల్లిదండ్రులను కూడా ఎదిరించేందుకు వెనుకాడదు. అలాంటి మన హిందూ దేశంలో ప్రస్తుతం పరిస్థితులు తలకిందులవుతున్నాయి. భర్తను దైవంగా చూసుకునే భార్యలు ఉన్న ఈ సమాజంలో నరకం చూపించే భార్యలు కూడా ఉన్నారు. అలాగే భార్యను కంటికి రెప్పలా చూసుకునే ఇదే సమాజంలో నిత్యం నరకయాతన పెట్టే భర్తలు కూడా కోకొల్లలు. తనను నమ్మి వచ్చిన భార్యను అర్థం చేసుకుని, అన్యోన్యంగా గడపాల్సిన కొంతమంది భర్తలు రాక్షసుల్లా ప్రవర్తించటం మనం చూస్తూనే ఉన్నాం. బెంగళూరులో ఓ వ్యక్తి ఇలాగే.. మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న భార్యను.. మాట్లాడుకుందామంటూ పిలిచి, టిఫిన్ తినిపించిన అనంతరం లాడ్జికి తీసుకెళ్లాడు. అయితే మాట్లాడే క్రమంలో చివరకు అతడు చేసిన పని.. సంచలనం కలిగించింది. అసలేం జరిగిందంటే..


బెంగళూరు తుమకూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుమకూరు పరిధి గడగ్‌కు చెందిన బాబుకు మధుగిరి ప్రాంతానికి చెందిన అనితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య క్రమక్రమంగా మనస్పర్థలు తలెత్తాయి. ఆ గొడవలు చిలికి చిలికి చివరికి గాలివానలా మారాయి. గొడవలు పెద్దవి అవడంతో విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భార్యపై రోజురోజుకూ కోపం పెంచుకుంటున్న భర్త.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కుట్రపన్నాడు. అదునుకోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం భార్య ఉంటున్న తుమకూరుకు చేరుకున్నాడు. ఫోన్ చేసి, మాట్లాడుకుందామంటూ పిలిచాడు.

చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ.. బాలిక ముఖంపై ఆవు పేడ పూసి మరీ.. ఆ యువకులు చేసిన పని..


తనను నమ్మి వచ్చిన అనితను ఓ లాడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు టిఫిన్ తినిపించి, ప్రేమగా మాట్లాడుతుండడంతో అనితకు ఎలాంటి అనుమానమూ రాలేదు. అనంతరం సీక్రెట్‌గా మాట్లాడాలంటూ ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా కత్తిని బయటికి తీసి, అనిత రెండు కాళ్లనూ నరికేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన అనిత.. రక్తపు మడుగులో కొట్టామిట్టాడుతూ కేకలు పెట్టింది. లాడ్జి సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే ఇలా చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

‘‘అమ్మా! ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్’’.. అంటూ ప్రశ్నించిన కొడుకు.. ఓ రోజు అసలు నిజం తెలియడంతో..



Updated Date - 2022-03-19T00:17:40+05:30 IST