వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..

ABN , First Publish Date - 2022-01-08T01:37:19+05:30 IST

వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు వదినను గదిలోకి తీసుకెళ్లాడు. రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాట... చాలా వరకు వెళ్లింది. వివారాల్లోకి వెళితే..

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..
విజయ్

వివాహేతర సంబంధాల విషయంలో వయసు, వరసలు చూసుకోకుండా చివరకు సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. ఆఖరికి చెల్లెలిని అన్న, కూతురును తండ్రి.. వక్రబుద్ధితో చూసే రోజులివి. తమిళనాడులో జరిగిన ఘటన కూడా దాదాపు ఇలాంటిదే. వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు వదినను గదిలోకి తీసుకెళ్లాడు. రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాట... చాలా వరకు వెళ్లింది. వివారాల్లోకి వెళితే..


తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాకు చెందిన ప్రభు, విజయ్ అన్నదమ్ములు. పెద్దవాడైన ప్రభుకు కొన్నేళ్ల క్రితం మంజు(26) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో 2017లో ఉపాధి నిమిత్తం.. ప్రభు విదేశాలకు వెళ్లాడు. దీంతో వారి కుటుంబంలో ఏ అవసరం వచ్చినా తమ్ముడు విజయ్ చూసుకునేవాడు. ఈ క్రమంలో వదినతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజూ ఆమెతోనే గడుపుతూ ఉండేవాడు. ఇటీవల ఓరోజు వదినను తీసుకుని ఏర్కాడ్‌లోని లాడ్జికి వెళ్లాడు.

లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని..


భార్యాభర్తలమని చెప్పి లాడ్జిలో గది తీసుకుని రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో తాను జనవరి 23న పెళ్లి చేసుకుంటున్నానని, తర్వాత ఎక్కువగా కలవలేనని వదినతో చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి అనంతరం నిద్రలోకి జారుకున్నారు. అయితే వేకువజాము 3గంటల సమయంలో వదిన కనిపించలేదు. బాత్‌రూం తలుపు వేసి ఉండడంతో డోర్ కొట్టి చూశాడు. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో బద్దలుకొట్టి చూడగా.. లోపల ఆమె ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..

Updated Date - 2022-01-08T01:37:19+05:30 IST