Home » Videos
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ సమీపంలోని ప్రేమ్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలెండర్ను రైల్వే లోకో పైలట్ గమనించారు.
తిరుమలలో కొలువైన ఆ బ్రహ్మండనాయకుడి ప్రసాదమై లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి వేళ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
బీసీ సీఎం నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకులను గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు మహాశాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగోట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చెపట్టారు. హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహించారు.
తిరుమల: టీటీడీ ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యాలు చేశారు. లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా.. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యతగల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు.
టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రపంచంలో ఏం జరిగినా ఇట్లే తెలిసిపోతోంది. సెల్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి.
తిరుమల లడ్డూపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా సహకరిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తుకు కూడా కేంద్రం సిద్దమేనని, హిందూ దేవాలయాల్లో హిందువులనే నియమించాలని అన్నారు.
కూకట్పల్లి నల్ల చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు ఉండగా 7 ఎకరాలు కబ్జా చేశారు. బఫర్జోన్లో 25 అపార్టుమెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు హైడ్రా టార్గెట్గా పెట్టుకుని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది.
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దుమారం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ మండిపడుతున్నారు.
నోయిడాలోని సెక్టార్ 31లో ఓ యువతికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ యువతి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పైనుంచి స్కూటీతో సహా జారి ఓ పిల్లర్పై పడింది.