Share News

Pawan Kalyan: జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగింది: పవన్ కల్యాణ్

ABN , Publish Date - May 08 , 2024 | 02:31 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan: జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగింది: పవన్ కల్యాణ్
Pawan Kalyan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (CM Jagan) అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇసుక రవాణాను ఆపి లక్షల కార్మికుల పొట్టను కొట్టారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. నా కష్టర్జీతాన్ని పేదలకు పంచి పెట్టానని, సీఎం జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగిందని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందజేయడంలో ఏపీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానెల్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ ఇంట్వర్యూ ఇచ్చారు. ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Updated Date - May 08 , 2024 | 02:31 PM