Share News

AP Elections: ఉగ్రవాదుల ఫ్యాక్టరీ వైసీపీ: పృథ్వీరాజ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 07:47 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. విజయనగరంలో జనసేన నేత, కూటమి స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించారు.

AP Elections: ఉగ్రవాదుల ఫ్యాక్టరీ వైసీపీ: పృథ్వీరాజ్
Prithviraj

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. విజయనగరంలో జనసేన నేత, కూటమి స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ (Prithviraj) ప్రచారం నిర్వహించారు. తాను కొద్దీరోజులు వైసీపీలో కొనసాగానని ఆయన వివరించారు. వైసీపీలో కంటిన్యూ అయినందుకు క్షమాపణలు చెప్పారు. వైసీపీ పార్టీ కాదని ఉగ్రవాదుల ఫ్యాక్టరీ అని పృథ్వీరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని కూడా రాజకీయాలకు కేంద్ర బిందువు చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో అన్ని రంగాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవిని గెలిపించాలని కోరారు. పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.


Read More
Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 09:12 PM