Rahul Gandhi: టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటే

ABN , First Publish Date - 2022-10-27T20:02:31+05:30 IST

TS News: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. పలువురు పార్టీ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

Rahul Gandhi: టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటే

TS News: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. పలువురు పార్టీ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆయనతో పాటు ముందుకు సాగుతున్నారు. హింస, ద్వేషం రూపుమాపడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటే, పార్లమెంట్‌లో బీజేపీ సర్కార్ బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా పనిచేస్తున్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెండు పార్టీలు..రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయి. మియాపూర్‌లో కేసీఆర్ ప్రభుత్వం భూస్కామ్‌కు పాల్పడింది. కాళేశ్వరంలో పెద్దఎత్తున కుంభకోణం జరిగింది. తెలంగాణలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతోంది ’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-27T20:02:48+05:30 IST