Gangula Kamalakar: కేఏ పాల్, పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని?

ABN , First Publish Date - 2022-12-22T15:30:03+05:30 IST

కేఏ పాల్, పవన్‌ కళ్యాణ్, షర్మిలకు తెలంగాణలో ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

Gangula Kamalakar: కేఏ పాల్, పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని?

కరీంనగర్: కేఏ పాల్ (KA Paul), పవన్‌ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan), షర్మిల (YSRTP Chief Sharmila)కు తెలంగాణలో ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ (Telangana Minister Gangula Kamalakar) ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసలు సిసలు మనిషి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కూడా ఎంటర్ అయ్యారన్నారు. రెండు రాష్ట్రాలు జూన్ 2న ఏర్పడినా.. చంద్రబాబు ప్రమాణం చేయలేదని తెలిపారు. ఏపీ మూలాలు ఉన్న నేతలకు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)ను కూలగొట్టి తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, షర్మిలలు బీజేపీ దూతలని వ్యాఖ్యలు చేశారు. సీలేరు గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు కూడా అక్కడి పార్టీలను నమ్మడం లేదన్నారు. ఏపీలో కచ్చితంగా పోటీ చేస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-22T15:30:04+05:30 IST