Home » Karimnagar
Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, హాఫ్ బాటిల్ మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు.
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘హిందూ సమాజమంతా నా వెనక ఉంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎ్సను మూసివేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా..?’’ అంటూ కేసీఆర్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ , వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన చివరి దాకా ఉండేలా లేదని... మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని.. ఆయనఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చివేస్తామని రేవంత్రెడ్డి హెచ్చరించారు.