Home » Karimnagar
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకనం (స్పాట్)లో నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి సీహెచ్వీఎస్ జనార్ధన్రావు వైఖరితో మూల్యంకన కేంద్రం గందరగోళంగా మారిందని, స్పాట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మనోవేదనకు గురువుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది.
ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 14 తేదీ నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని, బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుం దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు.
ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గాం ఛలో-బస్తీ ఛలోలో భాగంగా ఆయన పర్యటించారు. బైక్ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్ను, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని తనిఖీ చేశారు.
మహానీయుల జయం తి ఉత్సవాలలో భాగంగా గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళా శాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు క్విజ్, రంగోలి పోటీలు నిర్వహించారు.
గుర్తింపు కార్మిక సంఘాల వైఫల్యాలను కార్మిక వర్గానికి తెలియజేసే బాధ్యత కార్యకర్తలదేనని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శనివారం ఆర్జీ-2 ఏరియా ముఖ్య కార్యక ర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్ పదేళ్ళ కాలంలో జాతీయ సంఘా లు పోగొట్టిన హక్కులను సాధించడమే కాకుండా కోల్ ఇం డియాలో లేని హక్కులు సాధించినట్టు తెలిపారు.
గోదావరిని కాలుష్య రహితంగా మార్చడం ద్వారా ప్రజలకు పవిత్ర జలాలను అందిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, అమృత్ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రపంచంలోనే అగ్రదేశాలతో పోటీపడుతూ ముందుకు నడిపిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో పెద్దపల్లి మున్సి పాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు.