Harish Rao: సింగరేణి పరిరక్షణకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉంది

ABN , First Publish Date - 2022-12-29T15:11:03+05:30 IST

సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

Harish Rao: సింగరేణి పరిరక్షణకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉంది

మంచిర్యాల: సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సింగరేణిలో 16 వేల కొత్త ఉద్యోగాలు కలిపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే... కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెబితే, బొగ్గు గనుల శాఖ మంత్రి మాత్రం ప్రైవేటు చేసేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు దేశ సంపదను దోచి పెడుతోందంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-12-29T15:11:04+05:30 IST