ShabbirAli: టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి

ABN , First Publish Date - 2022-10-28T14:04:38+05:30 IST

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు.

ShabbirAli: టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి

మహబూబ్‌నగర్: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (TRS MLAs poaching case)లో టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ (Shabbir Ali)విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల(Congress MLAs)ను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని... 9 రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ దొంగలే అని వ్యాఖ్యలు చేశారు. ముందు రూ.100 కోట్లు అన్నారు.. రూ.15 కోట్లు అన్నారు.. చివరకు ఒక్క పైసా లేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న రూ.15కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను పోలీసులు ప్రగతిభవన్‌కు ఎలా తీసుకెళ్తారని షబ్బీర్‌అలీ (Congress leader) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-28T14:04:40+05:30 IST