Home » Mahabubnagar
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.
చేతిలో ఊత కర్రలు.. దట్టమైన అటవీ మార్గం గుండా వడి వడి అడుగులు.. తనువెల్లా భక్తి పారవశ్యం.. మది నిండా లింగమయ్య నామ సమ్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం బయలుదేరారు.
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపూర్కు చెందిన కొత్తకోట సీతాదయాకర్రెడ్డి నియమితులయ్యారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. శనివారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Palamuru Rangareddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది.
నిలువు రాళ్లుగా పిలిచే అద్భుతానికి యునెస్కో గుర్తింపు ఇక చాలా దూరంలో లేదు. క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని పరివాహక ప్రాంతంలో నిక్షిప్తమైన మెగా లిథిక్స్ స్టోన్స్కు యునెస్కో ఇప్పుడు తాత్కాలిక లిస్ట్లో చోటు కల్పించింది.
చారిత్రక నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దేశంలోని మరో ఐదు ప్రదేశాలతో కలిపి నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లను కూడా ఎంపిక చేశారు.
అన్ని జిల్లాల్లోనూ 37 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత కనిపించింది. వచ్చే 2రోజులు ఎండ తీవ్రత అలాగే ఉంటుందని హెచ్చరించింది. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు..