AP Deputy CM నారాయణస్వామి సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-02-01T13:47:13+05:30 IST

డిప్యూటీ సీఎం నారాయణస్వామి సాక్షిగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

AP Deputy CM నారాయణస్వామి సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి (AP DeputyCM Narayanaswamy) సాక్షిగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం వెదురు కుప్పం మండలం మారేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారేపల్లి గ్రామానికి చెందిన పొన్నెమ్మ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ అవినీతికి పాల్పడిందంటూ అధికారులు తొలగించారు. అయితే ‘‘స్థానిక సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా తాను చెప్పినట్లు వినలేదంటూ నాపై ఆరోపణలు చేసి తన ఉద్యోగాన్ని పోగొట్టాడని’’ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గడపగడపకు వచ్చిన డిప్యూటీ సీఎంతో తన ఆవేదన చెప్పేందుకు వెళితే నాయకులు అడ్డగించారంటూ పొన్నెమ్మ పురుగుల మందు తాగింది. వెంటనే గ్రామాస్తులు పొన్నమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-02-01T13:47:14+05:30 IST