AP News: ఇది వైద్యుల నిర్లక్ష్యమా? లేక ఇంకేమైనా జరిగిందా?

ABN , First Publish Date - 2023-04-19T13:58:07+05:30 IST

నగర ప్రభుత్వఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ మహిళ ప్రసవంలో బిడ్డ మృతి చెందింది.

AP News: ఇది వైద్యుల నిర్లక్ష్యమా? లేక ఇంకేమైనా జరిగిందా?

చిత్తూరు: నగర ప్రభుత్వఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ మహిళ ప్రసవంలో బిడ్డ మృతి చెందింది. పురిటి నొప్పులతో నిన్న ఆస్పత్రిలో చిత్తూరు టెలిఫోన్ కాలనీకి చెందిన షమీమ్ చేరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మగ బిడ్డకు షమీమ్ జన్మనిచ్చించి. ఐసీయూలో ఉంచిన బిడ్డ చనిపోయినట్లు వైద్య సిబ్బంది. తల్లికి అప్పగించిండం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మెడికల్ సూపర్డెంట్ విచారణ జరుపుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబీకులు, బంధువులు వాపోతున్నారు.

Updated Date - 2023-04-19T13:58:07+05:30 IST