Share News

AP News: పుంగనూరులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-12-01T11:15:16+05:30 IST

Andhrapradesh: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు.

AP News: పుంగనూరులో ఉద్రిక్తత

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇవ్వమని గోపిశెట్టిపల్లె రైతులు వెల్లడించారు. దీంతో గోపిశెట్టిపల్లెను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ఈరోజు (శుక్రవారం) పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రతినిధులు పుంగనూరుకు రానున్నారు. అయితే భూములు ఇచ్చేందుకు గోపిశెట్టిపల్లె రైతులు అంగీకరించకపోవడంతో గ్రామంలోకి భారీగా పోలీసులు మోహరించారు. పుంగనూరుకు రాకుండా గోపిశెట్టిపల్లె గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-12-01T11:15:18+05:30 IST