Deputy CM: ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేయడం ఆయనకే తెలుసు..

ABN , First Publish Date - 2023-06-20T16:10:02+05:30 IST

అమరావతి: రాజమండ్రిలో మహనాడు అట్టర్ ప్లాప్ అయ్యిందని, కాపులు ఎవ్వరూ చంద్రబాబును ఆదరించలేదని, దీంతో వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభించమని చెప్పారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

Deputy CM: ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేయడం ఆయనకే తెలుసు..

అమరావతి: రాజమండ్రిలో మహనాడు (Mahanadu) అట్టర్ ప్లాప్ అయ్యిందని, కాపులు ఎవ్వరూ చంద్రబాబు (Chandrababu)ను ఆదరించలేదని, దీంతో వారాహి యాత్ర (Varahi Yatra)ను ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభించమని చెప్పారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Deputy CM Kottu Satyanarayana) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీటింగ్‌లకు డబ్బులిచ్చి తెస్తున్నారని.. నిన్న కనపడిన వాడే నేడు అక్కడ కనపడుతున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను చంపాలని సుపారీ ఇచ్చినట్టు చెపుతున్నారని, పవన్‌పై మాకు కోపం లేదని, జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంటుందని అన్నారు.

సుపారీ ఇచ్చి పవన్‌ను భౌతికంగా తొలగించాలనే ఆలోచన చంద్రబుకే ఉంటుందని, ఆయనకే రాజకీయ లబ్ది అని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏదో జరగుతుందనే సమాచారం ఉందనుకుంటే పవన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేయడం చంద్రబాబుకే తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని, అదేమైనా బ్రహ్మ పదార్ధమా? అని ప్రశ్నించారు. కేంద్రంతో ప్రత్యేక ప్యాకేజి ఒప్పుకుంది చంద్రబాబేనన్నారు. అయినా ప్రత్యేక హోదా తప్పనిసరిగా సాధిస్తామని.. దానికీ ఓ రోజు వస్తుందన్నారు. చంద్రబాబు ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చునని.. జగన్‌తో మాత్రం పెట్టుకోవద్దన్నారు. పవన్ కళ్యాణ్‌కు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తామని, అయన కూడా రాష్ట్రంలో ఓ పౌరుడేనని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-20T16:10:02+05:30 IST