AP News: ఏపీ మంత్రి గన్‌మెన్‌పై పీఎంవోలో మహిళ ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-08-01T18:03:59+05:30 IST

ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌పై ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దివ్యాంగురాలు సాయిలక్ష్మి చంద్రపై దాడి చేశారంటూ ఆమె తల్లి ఆరుద్ర ఫిర్యాదు చేసింది.

AP News: ఏపీ మంత్రి గన్‌మెన్‌పై పీఎంవోలో మహిళ ఫిర్యాదు

ఢిల్లీ: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌పై ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దివ్యాంగురాలు సాయిలక్ష్మి చంద్రపై దాడి చేశారంటూ ఆమె తల్లి ఆరుద్ర ఫిర్యాదు చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌ కన్నయ్య తన కూతురుపై దాడి చేశారని పీఎంవోలో ఆరుద్ర కంప్లెంట్ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్ దాఖలైనా ఇంతవరకూ అన్నవరం పోలీసులు చర్యలు తీసుకోలేదని వాపోయింది. తన కుమార్తె మళ్లీ ఎప్పటిలాగా లేచి తిరిగేలా వైద్యం చేయించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అనంతరం మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్‌లకు కూడా ఆరుద్ర ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసేలా ఏపీ సీఎం జగన్‌కు ఆదేశించాలంటూ ఆరుద్ర కోరింది. సీఎం జగన్‌కు, స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Updated Date - 2023-08-01T18:03:59+05:30 IST