Ayesha Meera: ఆయేషామీరా తల్లిదండ్రుల్ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

ABN , First Publish Date - 2023-09-18T07:29:31+05:30 IST

తెనాలిలో సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సీబీఐ అధికారులు ఆయేషామీరా ఇంటికి వచ్చారు. ఆయేషామీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషాతో కేసుకు సంబంధించిన

Ayesha Meera: ఆయేషామీరా తల్లిదండ్రుల్ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

గుంటూరు: తెనాలిలో సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సీబీఐ అధికారులు ఆయేషామీరా (Ayesha Meera) ఇంటికి వచ్చారు. ఆయేషామీరా తల్లిదండ్రులు (Ayesha Meera parents) శంషాద్ బేగం, బాషాతో కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం అధికారుల తీరుపై మండిపడ్డారు. కేసును ఇంకెన్ని సంవత్సరాలు సాగదీస్తారని ప్రశ్నించారు. మేం బాధితులమా? లేక నిందితులమా? అంటూ నిలదీశారు. మతపెద్దలను కాదని కుమార్తె సమాధి తవ్వేందుకు అంగీకరించామని వాపోయారు. తీసుకెళ్లిన శరీర భాగాలు ఎందుకు అప్పగించలేదని శంషాద్ బేగం ప్రశ్నించారు.

Updated Date - 2023-09-18T07:33:11+05:30 IST