KVP: మన్మోహన్‌ను అయినా ఒప్పించటం సులువు కానీ.. రోశయ్యను మాత్రం..

ABN , First Publish Date - 2023-07-04T11:22:04+05:30 IST

తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, పట్టణ అధ్యక్షుడు చందు సాంబశివుడు నివాళలర్పించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ... అపారమైన శ్రమపడేతత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయటం లాంటి తత్వం ఉన్న గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.

KVP: మన్మోహన్‌ను అయినా ఒప్పించటం సులువు కానీ.. రోశయ్యను మాత్రం..

గుంటూరు: తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah)జయంతి సందర్భంగా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు (Former MP KVP Ramachandra rao), పట్టణ అధ్యక్షుడు చందు సాంబశివుడు నివాళలర్పించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ... అపారమైన శ్రమపడేతత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయటం లాంటి తత్వం ఉన్న గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. మన వల్ల భావితరాలకు అప్పుల భారం పడకూడదని ఆలోచించే వ్యక్తి రోశయ్య అని అన్నారు. ఆర్థికపరంగా గొప్ప ఎకనామిస్ట్ అయిన మన్మోహన్ సింగ్‌ను (Manmohan Singh) ఒప్పించటం సులువు కానీ రోశయ్యను మాత్రం ఒప్పించలేకపోయే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు. ప్రజల డబ్బులకు ధర్మకర్తలం మాత్రమే ఆర్థిక క్రమశిక్షణ తప్పితే రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడుతుందని చెప్పేవారని తెలిపారు. ప్రజా ధనానికి రోశయ్య ట్రస్టీగా మాత్రమే ఉండేవాళ్ళన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇవాల్టికి ఆర్థిక శక్తిగా ఉంది అంటే రోశయ్య పునాదులే కారణమన్నారు. రోశయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు అమూల్యమైనవి అంటూ కేవీపీ పేర్కొన్నారు.

Updated Date - 2023-07-04T11:22:04+05:30 IST