Share News

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. లూథ్రా వాదనలు ఇవే..

ABN , First Publish Date - 2023-10-19T12:32:28+05:30 IST

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు.

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. లూథ్రా వాదనలు ఇవే..

అమరావతి : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు. వైద్యులు సిఫార్సు చేసిన అంశాలను లూథ్రా కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును లూథ్రా కోరారు. కాగా.. చంద్రబాబు సుమారు 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులోచంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ జరిగింది. బాబు తరుఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-10-19T12:43:25+05:30 IST