Home » Nara Chandrababu Naidu
శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్లో బాబు బస చేస్తారు.
ఎన్ఆర్ఐలను వైఎస్సార్సీపీ (YSRCP) టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నారై యూఎస్ఏ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం (Komati Jayaram) అన్నారు. పోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్ఐలు టీడీపీకి మద్దతు ఇవ్వడం దేశద్రోహమా? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) చేరారు. శుక్రవారం నాడు పాలకొల్లులో జరిగిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో ఎంపీ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుదని తెలిపారు.
వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh)కు ఎస్ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.
ప్రజావేదిక ధ్వంసం నుంచి జగన్ విధ్వంస పాలన మొదలైందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. గురువారం నాడు గొల్లపూడిలో టీఎన్ఎస్ఎఫ్ నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు పాల్గొన్నారు.
Gautam Sawang Comments Viral: ఇదిగో ఇప్పుడు చెప్పండి.. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అయితే నేడు కాదా.. కాకూడదా..? అనేది పోలీసులకు, వైసీపీ నేతలకు తెలియాలి మరి. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం, అబ్బే అస్సలు తప్పు కాదన్న ఇదే పోలీసులు, పోలీస్ బాస్.. ఇప్పుడు మాత్రం జగన్పై చెప్పు విసిరారు అనే సరికి ఎంత హడావుడి చేస్తున్నారో చూస్తున్నాం కదా..
నేడు విధ్వంస జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక-సంక్షేమ విప్లవం తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు.
అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నియోజకవర్గ ఇంచార్జ్ అరవింద్ బాబు, కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్ద్ లూద్రా కుమారుని పెళ్లి రిసెప్షన్కు చంద్రబాబు హాజరు కానున్నారు.
ఏపీలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్లోని నివాసానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.