Share News

Srisailam: శ్రీశైలంలో కన్నులపండుగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2023-11-26T20:10:21+05:30 IST

శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది.

Srisailam: శ్రీశైలంలో కన్నులపండుగా కార్తీక పౌర్ణమి వేడుకలు

నంద్యాల: శ్రీశైలంలో కన్నులపండువగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఘనంగా నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతోంది. గంగాధర మండపం వద్ద వైభవంగా కార్తీక జ్వాలాతోరణం జరుగుతోంది. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్వాలాతోరణానికి మొదటిగా దివిటీలతో మంత్రి రోజా, ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి వెలిగించారు. శివాన్నమస్మరణతో శ్రీశైలం క్షేత్రం మారుమోగుతోంది. జ్వాలాతోరణం భస్మాన్ని నుదుటిపై పూసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జ్వాలాతోరణ కార్యక్రమానికి మల్లన్న భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Updated Date - 2023-11-26T20:17:50+05:30 IST