Share News

Skill Case : సీఐడీ విచారణకు హాజరైన లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్

ABN , First Publish Date - 2023-10-16T12:03:34+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజులు క్రితం రాజేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Skill Case : సీఐడీ విచారణకు హాజరైన లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ స్కిల్ కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజులు క్రితం రాజేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో రాజేష్ పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. అవసరమైతే ఆయనకు సీఆర్పీసీలోని 41 A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. ఈ రోజు హజరుకావల్సిందిగా రాజేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలు పెద్దఎత్తున సిట్ కార్యాలయానికి తరలివచ్చారు.

Updated Date - 2023-10-16T15:54:45+05:30 IST