Kollu Ravindra: సీఎం జగన్కు పసుపు చొక్కా కనపడితే వణికి పోతున్నారంటూ కొల్లు రవీంద్ర ఫైర్
ABN , First Publish Date - 2023-10-24T16:39:29+05:30 IST
ఏపీ సీఎం జగన్పై (CM Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్పై (CM Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కారణంగా పుంగనూరు ఘటన జరిగిందని కొల్లు రవీంద్ర విమర్శించారు.
"పుంగనూరు పాకిస్తాన్లో ఏమైనా ఉందా. పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి జాగిరా. పుంగనూరులో బీసీల చొక్కా విప్పితే డీజీపీ చోద్యం చూస్తున్నారు. సీఎం జగన్ కి పసుపు చొక్కా కనపడితే వణికి పోతున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదు. వైసీపీ నేతలకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత లేదు. బీసీలను నడి బజార్లో నిలబెట్టి బస్సు యాత్రలా." అని కొల్లు రవీంద్ర విమర్శించారు.