Vishnu vardhan: మంత్రి అమర్నాథ్‌పై బీజేపీ నేత విష్షువర్థన్ ఫైర్

ABN , First Publish Date - 2023-07-29T16:53:57+05:30 IST

గుడివాడ అమర్నాథ్ నీ దగ్గర సమాధానం ఉందా? దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు!?, అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరాకుండా వాగుతావా?. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే..

Vishnu vardhan: మంత్రి అమర్నాథ్‌పై బీజేపీ నేత విష్షువర్థన్ ఫైర్

విజయవాడ: మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu vardhan reddy) ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గుడివాడ అమర్నాథ్ నీ దగ్గర సమాధానం ఉందా? దిగజారుడు భాష మాట్లాడడం ఎందుకు!?, అధికారం తలకెక్కితే కన్నూమిన్నూ కానరాకుండా వాగుతావా?. బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే.. కుటుంబ, వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి విమర్శలు చేయడం దివాలాకోరు రాజకీయానికి నిదర్శనం. అసలు మీ తండ్రిది ఏ పార్టీ.. ఆయన చనిపోయిన తర్వాత యువకుడిగా రాజకీయాల్లో వచ్చారు. మీ తండ్రి గొప్ప మనిషి.. ఆయన విలువలు కాపాడు? వ్యక్తిగతంగా విమర్శించాలనుకుంటే.. మేము కూడా లెక్కలేనన్ని విమర్శలు చేయగలం. రోత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన మీరు కూడా మాట్లాడేవారేనా ? చేతనైతే మా అధ్యక్షురాలు అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన సమాధానం‌ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రజల ముందు విడుదల చేయండి. మీ దగ్గర లెక్కలు, వాటి సమాధానాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కండి.’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-07-29T16:53:57+05:30 IST