Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

ABN , First Publish Date - 2023-05-21T15:56:36+05:30 IST

విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డికి (CM Jagan) సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) విమర్శించారు.

Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డికి (CM Jagan) సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) విమర్శించారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదని.. పేదల ద్రోహి అని అన్నారు. అన్న క్యాoటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చిన చంద్రబాబు పేదల పెన్నిధి అని, అన్న క్యాoటీన్ రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన జగన్ పేదల పెన్నిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు తెచ్చిన 100కుపైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్‌.. పేదల పెన్నిధి అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? అని నిలదీశారు.

ఉచిత ఇసుక రద్దు చేసి ఇసుక దోపిడీ చేస్తున్న సీఎం జగన్ దోపిడి దారుడు అవుతాడు తప్ప.. పేదల పెన్నిధి ఎలా అవుతారని అనురాధ ప్రశ్నించారు. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడికి శిరోముండనం చేసిన జగన్ పేదల పెన్నిదా?.. టిడ్కో గృహాలు ఇవ్వకుండా పేదలను వేధించిన జగన్ పేదల పెన్నిధి ఎలా అవుతారని నిలదీశారు. తాడేపల్లిలో తన ఇంటి దగ్గర ఉన్న పేదల ఇల్లు కూల్చేసిన జగన్ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామనడం ఏంటన్నారు. జగన్ బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దళితుల అసైన్డ్ భూములు లాక్కున్న వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎలా అవుతోందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. నిజమైన పేదల పెన్నిధి చంద్రన్న.. పేదల ద్రోహి జగన్ అని అనురాధ మరోసారి స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-21T15:56:36+05:30 IST