Share News

Bhuvaneswari: మిచౌంగ్ తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి ట్వీట్

ABN , First Publish Date - 2023-12-06T08:37:15+05:30 IST

అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.

Bhuvaneswari: మిచౌంగ్ తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి ట్వీట్

అమరావతి: మిచౌంగ్ తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘పెద్ద ఎత్తున ప్రజల ఆస్తి, పంట నష్టం బాధ కలిగిస్తోంది.. చేతికొచ్చిన పంట నీటి పాలైన రైతన్నల బాధ వర్ణనాతీతం.. తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం.. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే @ntrtrust ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్దమైంది.. సాధ్యమైనంత త్వరగా ఆపన్నులకు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాం.. చేతనైన సాయంతో ఊరట కల్పిస్తాం.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాను.’’ అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Updated Date - 2023-12-06T11:01:47+05:30 IST