Share News

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' యాత్రకు భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ

ABN , First Publish Date - 2023-10-21T20:25:41+05:30 IST

ఈ నెల 25వ తేదీ నుంచి 'నిజం గెలవాలి' పేరుతో టీడీపీ చేపట్టబోయే యాత్రకు తగిన భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి లేఖ రాశారు.

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' యాత్రకు భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ

అమరావతి: ఈ నెల 25వ తేదీ నుంచి 'నిజం గెలవాలి' పేరుతో టీడీపీ చేపట్టబోయే యాత్రకు తగిన భద్రత కల్పిచాలంటూ డీజీపీకి లేఖ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి నుంచి 'నిజం గెలవాలి' నారా భువనేశ్వరి యాత్ర ప్రారంభం కానుంది.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు ఏవీ కూడా జరగకుండా ఉండే విధంగా భువనేశ్వరికి తగిన బందోబస్త్ కల్పించాలంటూ లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో భువనేశ్వరి యాత్ర జరిగే ప్రాంతాల్లో తగిన విధంగా బందోబస్త్ కల్పించాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-10-21T20:28:17+05:30 IST