AP News: ఇద్దరు యువకులపై నడిరోడ్డులో మూకుమ్మడి దాడి.. ఉలిక్కిపడ్డ నూజివీడు వాసులు

ABN , First Publish Date - 2023-08-02T15:17:56+05:30 IST

తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.

AP News: ఇద్దరు యువకులపై నడిరోడ్డులో మూకుమ్మడి దాడి.. ఉలిక్కిపడ్డ నూజివీడు వాసులు

ఏలూరు జిల్లా: తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. అసలేం జరిగిందంటే.. నూజివీడులోని ఓ హోటల్‌లో మద్యం మత్తులో ఓ ప్రముఖ వ్యక్తిని ఇద్దరు యువకులు అసభ్య పదజాలంతో దుషించారు. విషయం తెలిసిన ప్రముఖ వ్యక్తి అనుచరవర్గం.. ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానిక చిన్నగాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిల్చున్న యువకులు వాసు, దిలీప్‌లను పట్టుకుని కాళ్ళతో, చేతులతో పిడిగుద్దులు కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. నడిరోడ్డుపై చోటుచేసుకున్న భయానక దృశ్యంతో పాదచారులు, వాహానదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రధాన కూడలిలో ఇంతటి అమానుషం జరుగుతున్నా.. పోలీసు కనపడకపోవడం, సంఘటన ప్రాంతంలో సరైన సీసీ కెమెరాలు లేకపోవడంపై ప్రభుత్వ యంత్రాంగ పని తీరును ప్రశ్నించేలా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు యువకులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-02T15:26:58+05:30 IST