Crime: 8 నెలల గర్భంతో ఉన్న కూతురిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-08-27T21:49:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల నిండు గర్భంతో ఉన్న కూతురిని ఆమె తల్లిదండ్రులే దారుణంగా చంపేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని నదిలో పడేశారు.

Crime: 8 నెలల గర్భంతో  ఉన్న కూతురిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల నిండు గర్భంతో ఉన్న కూతురిని ఆమె తల్లిదండ్రులే దారుణంగా చంపేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఓ యువతి గతేడాది ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి గత డిసెంబర్‌లో అచూకీ కనుగొన్నారు. అయితే యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడిపై పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు ప్రస్తుతం జైళ్లో ఉన్నాడు. కేసు విచారణలో భాగంగా శనివారం యువతి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆరా తీయగా యువతి చనిపోయినట్టుగా తేలింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టులో ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని యువతికి ఆమె తల్లిదండ్రులు సూచించారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు కూతురు ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసుల విచారణలో తల్లిదండ్రులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Updated Date - 2023-08-27T21:49:10+05:30 IST