Crime: ఈ భార్యలు ఇంత రాక్షసంగా తయారయ్యారేంటి.. పాపం అన్యాయంగా భర్తలు బలవుతున్నారు.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-19T18:18:33+05:30 IST

ఈ మధ్య పలువురు భార్యలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. భర్తల అడుగుజాడల్లో నడవాల్సిన భార్యలు చివరకు అతడినే అంతమొందిస్తున్నారు. ఆ దారుణ ఘటనలకు అక్రమ సంబంధాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

Crime: ఈ భార్యలు ఇంత రాక్షసంగా తయారయ్యారేంటి.. పాపం అన్యాయంగా భర్తలు బలవుతున్నారు.. అసలు ఏం జరిగిందంటే..?

కాన్పూర్: ఈ మధ్య పలువురు భార్యలు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. భర్తల అడుగుజాడల్లో నడవాల్సిన భార్యలు చివరకు అతడినే అంతమొందిస్తున్నారు. ఆ దారుణ ఘటనలకు అక్రమ సంబంధాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. అతడితో కలిసి ఉండేందుకు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోహిత్ జోషి(Sohit Joshi), ప్రతిమ(Pratima) భార్య భర్తలు. సోహిత్ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 9 సంవత్సరాల క్రితం 2014లో పోక్సో చట్టం కింద నమోదైన కేసులో కన్హయ్య(Kanhaiya) జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో సోహిత్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు.


జైలు నుంచి విడుదలైన తర్వాత కన్షయ్య తన స్నేహితుడైన సోహిత్ ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే సోహిత్ భార్య ప్రతిమతో అక్రమ సంబంధం(Extramarital Affair) ఏర్పడింది. ఈ అక్రమ సంబంధం మరింత ముదరడంతో ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు సోహిత్‌ అడ్డును తొలగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే కన్హయ్య తన స్నేహితులైన అభినవ్ తివారీ, నందుల సహాయం తీసుకున్నాడు. అయితే అభినవ్‌కు కూడా సోహిత్ తెలుసు. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో సోహిత్‌ను ఆసుపత్రిలో చేర్చాడు. కన్హయ్య తన మరో స్నేహితుడు ప్రదీప్ కుమార్‌తో కలిసి సోహిత్‌ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ఆగష్టు 17న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో నిందితులైన ప్రతిమ, కన్హయ్య, అతని స్నేహితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Updated Date - 2023-08-19T18:23:27+05:30 IST